SAKSHITHA NEWS

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న
దైద రవీందర్

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ మండలం నోముల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నియోజక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాడు రవీందర్ రెడ్డి ముస్కు స్టాలిన్ రెడ్డి ఎంపిటిసి సామ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS