SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా

ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురలకు కౌన్సిలింగ్.

ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించిన నూతన సిఐ సాంబశివరావు.

వినుకొండ:- పట్టణంలోని ట్రాఫిక్ పై నూతన సిఐ దృష్టి సారించారు. ఈరోజు కూడ శివయ్య స్థూపం సెంటర్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్ బాలురలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన నూతన సిఐ సాంబశివరావు. సుమారు 11 నుంచి 18 సంవత్సరాలు గల బాలురలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్ బాలురులు ర్యాష్ డ్రైవింగ్ వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలను నివారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు మైనారాటి తీరని తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.


SAKSHITHA NEWS