SAKSHITHA NEWS

124 డివిజన్ శంశిగుడా పరిధిలోని సాయి చరణ్ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అలాగే వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో పాండుగౌడ్, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, లక్ష్మమ్మ, యడ్ల సత్యనారాయణ, సుండు యాదగిరి, పోశెట్టిగౌడ్, సుధాకర్ రెడ్డి, వెంకటయ్య, ఏసుదాస్, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS