SAKSHITHA NEWS

Congress Party – Meeting of key workers under the leadership of Mohammad Saheb Hussain

వీణవంక మండలంలోని పలు గ్రామలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

                                                            వీణవంక మండలం లోని చల్లూరు, ఇప్పలపల్లి, ఎలబాక, గంగారం, బొంతుపల్లి, ఘనుముక్కుల, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమనికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీణవంక మండల సమన్వయ కర్తలు వన్నె రాజ మల్లయ్య, కల్వల రామచందర్ లు ముఖ్యఅతిథిగా హాజరై వీణవంక మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీలు జనవరి 5వ తేదీ లోపు ప్రకటించాలని వీణవంక మండలంలో ఉత్సాహంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ఈ అవకాశం వినియోగించుకోవాలని  పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు టీపీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని 2023లో పార్టీ అధికారం లోకి రావడానికి అందరం కలసి కట్టు గా పనీ చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ సీనియర్ నాయకులు, గంగాడి రాజి రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి,పెద్ది సంపత్ రెడ్డి,ఎ,సదయ్య,ఎండీ ఏజాజ్,పల్లె అంజిరెడ్డి,జున్నుతుల రత్నాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎండీ సలీం, బావు సంపత్, సతీష్, కొండల్ రెడ్డి తదితరులు పాలుగోన్నారు

SAKSHITHA NEWS