SAKSHITHA NEWS

|| కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు ||

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 127 డివిజన్ రంగ రెడ్డి నగర్ లోని ఇందిరానగర్ కి చెందిన నాగరాజు గారు గత కొన్నిరోజులుగా తలకు గాయం అయి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గారి ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను నాగరాజు కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో 127 డివిజన్ అధ్యక్షులు శివ కుమార్, 130 డివిజన్ సోమన్నా గారి శ్రీధర్ రెడ్డి, హరికిరణ్, భాస్కర్ రెడ్డి, కరణ్, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, సోమయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS