SAKSHITHA NEWS

తిరుపతి శ్రీనివాస సేతు తుది దశ పనుల్లో భాగంగ జరుగుతున్న ప్రెస్ట్ రెస్సింగ్ పనులను పరిశీలిస్తూ ఈ నెల 15 లోపు అన్ని పనులు పూర్తి కావలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఎం.డి హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస సేతుపై జరుగుతున్న పనులను కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలిస్తూ ఈ నెల 18వ తేది ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రెస్ట్ రెస్సింగ్ పనులను మరో మూడు రోజుల్లో పూర్తి చేసి తారు రోడ్డు పనులను చేపట్టాలన్నారు‌.

ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్ళు పనులను పర్యవేక్షిస్తూ పనుల వేగవంతానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా శ్రీనివాస సేతుపై ఆకర్షణియమైన లైటింగ్లు ఏర్పాటు చేయాలని, చక్కని సుందరీకరణ పెయింటింగ్స్ వేయించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. కమిషనర్ వెంట మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏయికామ్ సంస్థ ప్రతినిధి భాలాజీ వున్నారు.


SAKSHITHA NEWS