SAKSHITHA NEWS

మట్టి వినాయక ప్రతిమలను పంచిన వెంకటేష్ గౌడ్

పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద జి.ఎచ్.ఎం.సి వారు అందించిన మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని నినాదించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు కాశినాథ్ యాదవ్. శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, రాములుగౌడ్, వెంకటేష్, అంజి గౌడ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, మోజెస్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు మధులత, శిరీషా సత్తుర్, దేవి, రేణుక, వరలక్ష్మి, మహేష్, అంజయ్య యాదవ్, సంతోష్, వాలి నాగేశ్వరరావు, రవీందర్, ఖాజా, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS