SAKSHITHA NEWS

మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం…

సబీహా గౌసుద్దీన్

………

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , జిహెచ్ఎంసి అధికారులు మురళిధర్ రెడ్డి, యస్ ఆర్ పి సురేష్, లతో కలిసి మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలతో చెరువులు, కుంటలు, కలుషితమవుతాయని వాటిని కాపాడుకునేందుకు మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, కొండం శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, మాధవాచారి, కమల్ వాసన్, శ్యామ్ సుందర్ రెడ్డి, యోగి రాజు, బ్రహ్మం, లింగం, బాలయ్య, అగతముడి రమేష్, సురేష్, శ్రీనివాస్, ఇస్మాయిల్, బాలయ్య, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, పార్వతమ్మ, ఫేస్ టు లక్ష్మి, సత్యమ్మ రేవతి, లక్ష్మి, సత్యవేణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS