SAKSHITHA NEWS

కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సాధించిన చేవెళ్ల విద్యార్థి.

సన్మానం చేసిన చేవెళ్ల న్యాయవాదులు.


చేవెళ్ల : మట్టిలో పుట్టిన మాణిక్యంలాగా పరిశుద్ధ కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు కాలోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. చేవెళ్ల గ్రామంలో పారిశుద్ధ కార్యాలయంలో పనిచేసే కందవాడ సాయన్న కూతురు కందవాడ హిందు కాళోజి యూనివర్సిటీలో ఎంబిబిఎస్ లో ఫ్రీ సీటు సంపాదించింది. ఈ సందర్భంగా చేవెళ్ల లోని న్యాయవాదులు ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్బంగా హిందు మాట్లాడుతూ పెద్ద కాలేజీలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది అని, నేను ఈ సీటు సంపాదించడానికి నా చదువుతోపాటు మా అమ్మ నాన్నల కృషి కూడా ఎంతో ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జనార్ధన్, రాజశేఖర్, కుమార్, రవీందర్,మల్లేష్,రవీందర్, సురేందర్,ఆనంద్ మరియు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS