SAKSHITHA NEWS

అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయండి – బిఎస్పీ

సాక్షిత ప్రతినిధి నల్లగొండ జిల్లా

అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారని.ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడని అన్నారు. అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారని కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారన్నారు. చిట్యాల మండలంలో జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేడి రాజు, మండల నాయకులు గ్యార శేఖర్, బాకీ శంకర్ ప్రసాద్, మేడి కార్తీక్, వినయ్, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS