SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .


సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మీ కాలనీలో కానీ, మీ బస్తి లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను కానీ, కార్పొరేటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించండి అని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, మోహన్ రావు, జిఎన్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ బాబు, శంకర్ రావు, పుల్లారావు, రాధాకృష్ణ, ప్రేమ్ నాయక్, సాంబశివ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS