SAKSHITHA NEWS

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్
ప్రకాశం..జిల్లా
యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం యర్రగొండపాలెం ఈసి కందుల అనిల్ కుమార్ సొసైటీ ఫర్ ఎన్విరాంన్మెంటల్ విల్లెజి ఆక్టివిటీస్ (సేవ) అనే సొసైటీని స్థాపించి నిరు పేద ప్రజలను గుర్తించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కందుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది.ఇందులో భాగంగా ఉపాధి హామీలో పని చేస్తున్నటువంటి సిబ్బంది రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో రక్తం అవసరమై ఎంతోమంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి మానవత్వం చాటుకోవడం ఎంతో అవసరమన్నారు.రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి కుమార్,జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ అరుణ భాయి, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS