SAKSHITHA NEWS

రంగాపురంలో రహదారి అభివృద్ధి పనులకు భూమిపూజ.

పల్లెపండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

రంగాపురంలో 1430 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.75.30 లక్షలు.

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం

రెడ్డిగూడెం మండలంలోని రంగాపురం గ్రామంలో నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. రంగాపురంలో 1430 మీటర్ల పొడవునా నిర్మించనున్న 5 రహదారులకు రూ.75.30 లక్షల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ అంచనా వ్యయంతో ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ పల్లెపండుగ లాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS