SAKSHITHA NEWS

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

*
సాక్షిత : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గురువారం భూమి పూజ చేశారు._*

రూ.13.50 లక్షల నిధులతో 950 మీటర్ల పొడవునా పైపులైన్ నిర్మించనున్నారు. ఈ పైపులైన్ వల్ల గుంటుపల్లి గ్రామంలో ఊరు చివర నివాస ప్రాంతాలకు కూడా తాగునీటి వసతి కలుగుతుంది. గ్రామం అంతా పరిపూర్ణంగా మంచినీటిని సరఫరా చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్య నివారణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS