SAKSHITHA NEWS

బహుజన సమాజ్వాది పార్టీ కార్యవర్గ సమావేశం
అన్ని స్థానాల్లో పోటీచేస్తాం

శ్రీకాకుళంజిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ఎచ్చెర్ల కేడర్ క్యాంప్ కార్యకర్తల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాది పార్టీ అధ్యక్షులు పి.పరంజ్యోతి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని ఎక్కడ లేనివిధంగా బహుజనులపై దాడులు జరుగుతున్నాయని బహుజనులంతా ఒక్కటై బీఎస్పీ పార్టీనీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

మన పరిపాలన మన చేతికి వచ్చేలా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా175 నియో జకవర్గాల్లో పోటీకు సిద్ధంగా ఉన్నామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లాస సోమేశ్వరరావు,ఎచ్చెర్లనియోజకవర్గం ఇంచార్జ్ గంట్లోన రామారావు,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS