SAKSHITHA NEWS

బాచుపల్లిలో ‘ఫ్రీడం కప్‘ క్రికెట్ పోటీని ప్రారంభించిన ఎమ్మెల్యే…

……..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి హిల్ కౌంటీ మైదానంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన మేయర్ టీమ్ వర్సెస్ కమిషనర్ టీమ్ ఫ్రీడం కప్ క్రికెట్ పోటీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొద్దిసేపు క్రికెట్ ఆడి ఇరుజట్ల టీమ్ మెంబర్స్ కు ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS