SAKSHITHA NEWS

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….

▪️ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి.. జాతిపిత గాంధీజీ, భరతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం 75 మంది వీణ కళాకారులచే వీణా వాయిద్య ప్రదర్శన చేపట్టగా.. సీఎం కేసీఆర్‌ వీక్షించారు.

ఆ తర్వాత సాండ్‌ ఆర్ట్‌ ప్రదర్శన, దేశభక్తి ప్రబోధ నృత్యరూపకం, ప్యూజన్‌ ప్రదర్శన, లేజర్‌ షో జరుగనున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందేశాన్ని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఇవ్వనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హెచ్‌ఐసీసీకి తరలివచ్చారు. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS