SAKSHITHA NEWS

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటున్నారని,అందుకే యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల స్పూర్తి పొందిన ఎంతోమంది యువత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని,ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,ఫిషెర్మెన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పోషి మహేశ్,బత్తుల చిరంజీవి,బైండ్ల దయానంద్,మిద్దెల సీతారాం రెడ్డి,దుబాయ్ మల్లారెడ్డి,పూర్ణ చందర్,భాస్కర్,చైతన్య సాయి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS