SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 1,20,000/- ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని
CMRF వివరాలు

1.హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం విలేజ్ కి చెందిన నాసర్ ఖాన్ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 60,000/- అరవై వేల రూపాయలు

2.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కి చెందిన శ్రీమతి మంజులత కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 60,000/- అరవై వేల రూపాయలుగా మంజూరి అయినవి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని PAC చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. PAC చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్,పోతుల రాజేందర్ , MD ఇబ్రహీం, అనిల్ ,సాంబయ్య, శ్రీహరి ,పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS