SAKSHITHA NEWS

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: శంభీపూర్ క్రిష్ణ…

సాక్షిత : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు…
అనంతరం చర్చ్ గాగిలాపూర్ సీనియర్ నాయకులు రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు


SAKSHITHA NEWS