SAKSHITHA NEWS

విశాఖలో మరో ప్రమాదం..!
అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో జరిగిన ప్రమాదం మరవకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రు పార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రా డియంట్స్ సంస్థలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలైయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


SAKSHITHA NEWS