SAKSHITHA NEWS

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

-తంటికొండ వెంకన్న సన్నిధిలో శాంతి కల్యాణం నిర్వహించిన జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు

-హాజరైన జగ్గంపేట శాసనసభ్యు లు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు

గోకవరం, సాక్షిత : గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు శాంతి కల్యాణం నిర్వహించారు. తంటికొండ దేవస్థాన మాజీ చైర్మన్ బద్ధిరెడ్డి అచ్చన్న దొర ఆధ్వర్యంలోఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకుని, కళ్యాణాన్ని కనులారా తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రావణమాసం రెండవవారం శని త్రయోదశి పురస్కరించుకొని భక్తులు కొండకు పోటెత్తారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ లోకకళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ శాంతి కళ్యాణం నిర్వహించామని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా పాడిపంటలతో ధన, ధాన్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు భోజన సదుపాయాలను ఆలయ అధికారులు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS