SAKSHITHA NEWS

ఆచార్య జయశంకర్ సార్ ఆలోచనల జీవిత త్యాగమే స్వరాష్ట్ర తెలంగాణ
సాక్షిత : విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలంగాణ రూపకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్బంగా వికారాబాద్ MPDO కార్యాలయం ఆవరణలోని ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో BC కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS