SAKSHITHA NEWS

మచిలీపట్నం శనివారం విలేకరుల అక్రిటేషన్ రెండో జాబితా పై ఉన్న సమస్యను స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లిన విలేకరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క విలేకరి అక్రిటేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడేషన్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. అక్రిడేషన్ రెండో జాబితా మంజూరుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తొందరగా సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం గ్రామీణ విలేకరులు అక్రిటేషన్ మంజూరు సమస్యలను పరిష్కారం కోసం జిల్లా సమాచార శాఖ అధికారి ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీఏ అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, అక్రిటేషన్ కమిటీ సభ్యులు శ్రీకాంత్, సీనియర్ జర్నలిస్ట్ సోమేశ్వరరావు , కోకా మహేష్ ,పుట్టి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS