SAKSHITHA NEWS

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38) ఈనెల 16వ తేదీ ఇంట్లో నుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మధ్యాహ్నం స్థానికులు ఫ్లైఓవర్ కింద గుంతలో ఓ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


SAKSHITHA NEWS