SAKSHITHA NEWS

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

జగ్జీవన్ రామ్ కు ‘నామ’ నివాళి

జగ్జీవన్ రామ్ అసమాన ప్రతిభావంతులు

దేశ రాజకీయాల్లో కీలక భూమిక

జగ్జీవన్ రామ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి

యువతకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు పిలుపు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

పీడిత, తాడిత ,అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు.జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎంపీ నామ ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. అసమాన ప్రతిభ కలిగిన అతికొద్ది మందిలో ఆయన ముఖ్యులని అన్నారు.ఆయన కుమార్తె మీరా కుమార్ గతంలో లోక్ సభ స్పీకర్ గా పని చేసిన విషయాన్ని నామ గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు. పార్లమెంట్ లో తన వాగ్దాటితో మన్ననలు పొందారన్నారు.ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చిన అసమాన ప్రతిభావంతుడని కొనియాడారు.దళితులకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన హక్కులను పోరాడి సాధించారని పేర్కొన్నారు. భారత ఉప ప్రధాని పదవి అధీష్టించి, దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారని నామ కొనియాడారు. 50 ఏళ్లపాటు నిరంతరాయంగా ఎంపీ గా ప్రపంచ రికార్డు సాధించారన్నారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతో ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు. దేశంలో హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. దళిత హక్కుల కోసమే కాదని, మానవతా కార్యక్రమాల్లోనూ ఎంతో చురుకుగా పాల్గొనేవారని నామ గుర్తు చేసుకున్నారు. గాంధీ తో ఏకాభిప్రాయం కలిగే ఉండేవారని, సత్యాగ్రహం, శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా వంటి కీలక ఉద్యమాల్లో జగ్జీవన్ రాం ,గాంధీ వెంట నడిచారని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని నామ నాగేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS