SAKSHITHA NEWS

ఉద్యమకారునికి కన్నీటి వీడ్కోలు….
ఆత్మీయ మిత్రుడుని కోల్పోయినం…
ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపి జోగినిపల్లి సంతోష్…
భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను జగదీష్ పార్థివ దేహం పై కప్పిన మంత్రి కెటిఆర్….
ములుగు జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీష్ అంతిమయాత్ర లో – జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి ….

: *సాక్షిత : *ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో నిన్నటి రోజున ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ గుండెపోటుతో అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి & బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ * రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ , రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు, జెడ్పీ చైర్మన్ లు, జిల్లా అధ్యక్షులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి జెడ్పీ చైర్మన్ జగదీష్ అంతిమయాత్ర లో పాల్గొన్న *జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి *


SAKSHITHA NEWS