SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

ఘన సన్మానం

నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఎన్నికైన అనంతరం మొదటిసారిగా బాపట్ల వచ్చి ఆయనను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సాయి ప్యాలెస్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకరరావు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ చేతులు మీదగా అన్నవరపు నాగమల్లేశ్వరరావు ని ఘనంగా సన్మానించారు. సన్మానించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో జరిగిన జాతీయ సమావేశంలో 20 రాష్ట్రాలకు చెందిన నేషనల్ ధోబి మహాసంగ్ ఆయా రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కలిసి జాతీయ
అద్యక్షునిగా నాగమల్లేశ్వరరావు ను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన అన్నవరపు నాగమల్లేశ్వరరావు ని ఏకగ్రీవముగా ఎన్నుకోవడం పై స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా న్యాయ సలహాదారుడు అంగలకుదురు నటరాజన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా యువజన అధ్యక్షులు కొల్లిపర వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక బాపట్ల పట్టణ యువజన అధ్యక్షుడు ఉప్పలదిన్నె గోపీనాథ్, పున్నారావు తదితర రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS