SAKSHITHA NEWS

అభివృద్ధి చేసిన పనులను ప్రజలకు వివరించి మిగిలి ఉన్న పనులను తెలుసుకొని పూర్తి చేయాలనీ ఉద్దేశమే ఈ ప్రగతియాత్ర కార్యక్రమం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

ప్రగతియాత్రలో భాగంగా శివ నగర్ – A లో కమ్యూనిటీ హాల్ మరియు భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శివ నగర్ – ఏ మరియు శివ నగర్ – బి లో ప్రగతి యాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు,తమ కాలనీ అభివృద్ధికి సహకరించినందుకు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శివ నగర్ – A లో 17 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న కమ్యూనిటీ హాల్ మరియు 10 లక్షల వ్యయంతో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, పాదయాత్ర చేస్తూ ఎమ్మెల్యే గారు కాలనీలో పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు.

అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో అభివృద్ధి చేసిన పనులను ప్రజలకు వివరించి మిగిలి ఉన్న పనులను తెలుసుకొని పూర్తి చేయాలనీ ఉద్దేశమే ఈ ప్రగతియాత్ర కార్యక్రమం అని, ప్రజల సహకారంతో విజవంతంగా 97 రోజులు పూర్తి చేసుకున్నాం అని, గడిచిన 9 ఏండ్లలో కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచామని, నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన కర్తవయం అని తెలిపారు.అనంతరం కాలనీలో మిగిలి ఉన్న చిన్నపాటి పనులకు కూడా వ్యయప్రణాళికలు రూపొందించి వాటిని పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్నఅధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు జిఎహ్ఎంసి డి ఈ రూప దేవి, HMWS జి ఎం విష్ణు ప్రసాద్, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులూ సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, వేణు యాదవ్, బాబు గౌడ్, అజాం, సయ్యద్ సాజీద్, ప్రభాకర్, బ్రహ్మానంద చర్య, హనుమంతు, బండ మహేందర్, శివ నగర్ కాలనీ వాసులు రత్నేశ్వర్ రావు, నాగరాజ్, శ్రీకాంత్, చర్య, సాంబశివరావు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS