SAKSHITHA NEWS

400 ఎన్ బస్సు సర్వీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగించాలి.
డిపో మేనేజర్ ని కోరుకొంటున్న వాడచీపురపల్లి ప్రాంత ప్రజలు

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లి నుండి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సు నెంబర్ 400 ఎన్ సర్వీసులు కొనసాగించాలని ప్రయాణికులు కోరుచున్నారు. 400 ఎన్ సర్వీసులు రద్దు చేసి గాజువాక డిపో, సింధియా వరకు సర్వీసులు నడపడంతో వాడచీపురుపల్లి, పరవాడ తదితర గ్రామాల ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. రైల్వే స్టేషన్ కి వెళ్లటానికి ప్రయాణికులు ఎక్కువ లగేజీతో రెండు బస్సులు మారవలసి వస్తుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా రీజనల్ మేనేజర్ డిపో మేనేజర్ గ్రామస్తులు యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 400 ఎన్ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సర్వీసులు కొనసాగించాలని విన్నవించుకుంటున్నారు.


SAKSHITHA NEWS