SAKSHITHA NEWS

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,4,640/- నలబై లక్షల నాలుగు వేల ఆరు వందల నలబై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *


సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్, హైదర్ నగర్,ఆల్విన్ కాలనీ,కూకట్పల్లి(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,04,640/- నలబై లక్షల నాలుగు వేల ఆరు వందల నలబై రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో లబ్దిదారులకు చెక్కుల ను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉట్ల చంద్రారెడ్డి MD. ఇబ్రహీం,సత్యనారాయణ, సంతోష్ బీఆర్ ఎస్ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS