శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీలలో జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి.
శంకర్ పల్లి ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.
సాక్షిత శంకర్ పల్లి ;
శంకర్ పల్లి పట్టణంలో స్వచ్ఛతహి సేవ 20-24 భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేస్తున్నామని కమిషనర్ జి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి గెస్ట్ హౌస్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 27వ తేదీన శుక్రవారం ఉదయం7:30 పట్టణంలోని ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి బీడీఎల్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు, ఎస్ హెచ్ జి సభ్యులు, అసోసియేషన్ సభ్యులు, పత్రిక మిత్రులు, పట్టణంలోని వివిధ శాఖల అధికారులు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలు కమిషనర్ కోరారు.
శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
Related Posts
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…
రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
SAKSHITHA NEWS రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహనప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్…