
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు సీజ్ చేసిన పోలీసులు,తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్బాబు తెలిపారు..
