SAKSHITHA NEWS

సాక్షిత : బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క సంక్షేమం అభివృద్ధితోపాటు ప్రజలకు కావలసిన మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతినిత్యం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా మార్చారని నేడు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు హైదరాబాద్ మహానగరానికి విచ్చేసి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి ప్రధాన కారణమని అన్నారు… తిరిగి ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరింత ముందుకు వెళుతుంది అనడంలో సందేహం లేదని అన్నారు…


SAKSHITHA NEWS