వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు

Spread the love

వైసిపి పాలనలో పేదలకు అగచాట్లు

  • ఎన్.ఎస్.పి కాలనీ వాసులకు న్యాయం చేయాలి
    -నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

వైసీపీ ప్రభుత్వంలో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు.స్థానిక లింగంగుంట ఎన్.ఎస్.పి కాలనీ నివాసులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చారు.అదే సమయానికి జేసీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన డా౹౹చదలవాడ అరవింద బాబు ఎన్.ఎస్.పి కాలనీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తమ నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వకపోగా ఖాళీ చేయిస్తూ కరెంటు,నీటి సరఫరా నిలిపి వేసి ఇబ్బంది పెడుతున్నారని ఆయన వద్ద బాధితులు వాపోయారు.ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ 70 ఏళ్లగా లింగంగుంట ఎన్.ఎస్.పి కాలనీలో నివాసముంటున్న పేద కుటుంబాలను ఖాళీ చేయించడం అన్యాయం అన్నారు.లింగంగుంట అగ్రహారికులు పేరు పీఠాధిపతి దీపం ఉండి నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించడానికి వీలులేదని నాడు చెప్పడం జరిగిందన్నారు.పల్నాడు నూతన జిల్లా ఏర్పడిన తర్వాత లింగంగుంట ప్రాంతానికి కలెక్టరేట్,ఎస్పీ తదితర కార్యాలయాలు రావడంతో ఇక్కడ ఉన్న నివాస పేద కుటుంబాలను ఖాళీ చేయించడం దుర్మార్గమన్నారు.పేదలకు లింగంగుంట అగ్రహారం ఎస్టీ కాలనీ వద్ద ఇచ్చిన స్థలాలకు హక్కులు రావని,ప్రభుత్వం ఈ పేద కుటుంబాలకు సర్వహక్కులు లభించే వివేషణ స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం లింగంగుంట్ల నివాసం ఉంటున్న ఎన్.ఎస్.పి కాలనీ వాసులకు కరెంటు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.పేదల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పూదోట సునీల్,పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి శేఖర్,మల్లవరపు సింధు,సంజీవరావు,కాకుమాను వెంకట్రావు,అబుబాకర్,అంకమ్మ చౌదరి,ఖాసీం,నంబురి వెంకట్ రావు,రమేష్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page