పార్టీకి కార్యకర్తలే వెన్నెముక్కలు…*

Spread the love

Workers are the backbone of the party

పార్టీకి కార్యకర్తలే వెన్నెముక్కలు…

షాద్ నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

పార్టీకి కార్యకర్తలే బలమని ,మరింత కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని ఎప్పటిలాగే పతాక శీర్షికన నిలబెట్టేందుకు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ రోజు శ్రీనగర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో షాద్ నగర్ మున్సిపాలిటీలోని పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ
పటిష్టతతో పాటు శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేయాలని, మున్సిపల్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలన్నా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లటంలో పార్టీ కార్యకర్తల కృషే ప్రధాన‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన సీనియర్ నాయకులు, పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page