మతిస్థిమితం లేని వ్యక్తిని మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమములో చేర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

మతిస్థిమితం లేని వ్యక్తిని మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమములో చేర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ పట్టణంలోని NTR చౌరస్తా సమీపంలోని ఫైర్ స్టేషన్ మార్గం నుండి వారి నివాసానికి వెళ్తున్న, వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గెస్ట్ హౌస్ మూల మలుపున ఒక మతిస్థిమితం లేని వ్యక్తి పెద్ద జుట్టుతో, ఒంటి పై దుస్తువులు సరిగా లేకుండా దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయాడు, వెంటనే స్థానిక సీఐ టంగుటూరి శ్రీను కి ఫోన్ చేసి, ఆ వ్యక్తిని వెంటనే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి సమీపంలో గల మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమము లో చేర్చి, తనకు కావాల్సినవన్నీ సమకూర్చాలన్నారు.

ఎమ్మెల్యే సూచనలతో, సీఐ టంగుటూరి శ్రీను వారి సిబ్బందికి చెప్పి ఆ వ్యక్తి వెంట్రుకలను కత్తిరించి, శుభ్రపరిచి, మంచి దుస్తులను తొడిగించి, మహిమ మినిస్ట్రీస్ వృద్ధాశ్రమంలో ఉంచారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page