గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి

Spread the love

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు జన్మించి 122 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ ఆయన సేవలను గుర్తుంచుకునే విధంగా ఆనాడు పోరాటపటిమను ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని వెల్లడించారు. ఆ మహానుభావుని ప్రాణత్యాగ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని గుర్తు చేశారు. ఆయన సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare