దోమల నివారణకు మరో రెండు ఫాగింగ్ మిషన్లు

Spread the love

Two more fogging machines for mosquito control

దోమల నివారణకు మరో రెండు ఫాగింగ్ మిషన్లు

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలోకి మరో రెండు కొత్త ఫాగింగ్ మిషన్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు నగరపాలక సంస్థ ప్రాంగణంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలో ఇప్పటికే దోమల నివారణకు ఓక ఫాగింగ్ మిషన్ వుందని, ఇప్పుడు మరో రెండు ఫాగింగ్ మిషన్లను 24 లక్షలు వెచ్చించి కొనుగొలు చేయడం జరిగిందన్నారు.

దోమల నివారణకు ప్రతి ఒక్క డివిజన్లో ఈ ఫాగింగ్ మిషన్లు నిరంతరం పని చేస్తాయన్నారు. ప్రజలు కూడా దొమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు వృద్ది చెందకుండా చూడాలని, తమ చుట్టు ప్రక్కలా నీరు నిల్వవుండకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page