కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ

Spread the love
TRS party stands by the activists

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ

TRS పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద భీమా వర్తింపు

కార్యకర్తల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన
*- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ *


సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన క్రీ,శే,, ఇదురకంటి సోమయ్య, మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన క్రీ,శే,,గంగాదేవి సత్తయ్య గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో వీరికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద భీమా వర్తించింది. ఇందుకు సంబంధించిన రెండు లక్షల చెక్కులను తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ మృతుల కుటుంబ సభ్యులకు అందించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.

పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన భీమా చేసి ₹2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు., తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు భీమా సదుపాయం కల్పించిందని పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు.

Related Posts

You cannot copy content of this page