SAKSHITHA NEWS

శ్రీదేవి థియేటర్ వద్ద శరత్ బాబుకు ఘననివాళులు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని శ్రీదేవి థియేటర్ ఆవరణలో మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక శాఖ బోర్డు డైరెక్టర్ జే జే మోహనరావు ఆధ్వర్యంలో సినీ నటుడు శరత్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిసిన శరత్ బాబు ధన్యులని అన్నారు.శరత్ బాబు కళా రంగానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జెకె.వెంకటేశ్వరరావు,బి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నరు.


SAKSHITHA NEWS