బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన ఎమ్మెల్యే…

Spread the love

బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సత్తయ్య కుమారుడు పిట్ల నర్సింగ్ రావు (32) లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సత్తయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు.

నిరుపేద కుటుంబం కావడంతో తన వంతుగా రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నర్సింగ్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జక్కుల కృష్ణా యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, జగన్ నాయక్, కుంటి వెంకటేష్, ఏ.శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్, వీర చంద్రుడు, డి.వీరేష్, హాజీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page