లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

Spread the love
The MLA handed over Chief Minister's Relief Fund checks to the beneficiaries

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…

..
సాక్షిత : పటాన్చెరు నియోజకవర్గంలోని పలు మండలాలకు సంబదించిన 50 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 21 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు.


ఆపద కాలంలో నిరుపేదలను ఆపన్న హస్తంతో ఆదుకునే CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి TRS హయాంలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు చెక్కులను అందిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ,112వ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ , అమీన్పుర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి , ఎంపీపీ దేవానంద్ ,పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page