నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట టీడీపీ నాయకులు

Spread the love

కర్నూలు కి చెందిన పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న కడప జిల్లా లో విధులు నిర్వహిస్తూ గత వారం లో అనుమానస్పదoగా మృతి చెందడం తో ఈరోజు 19 వ వార్డ్ లో రామచంద్ర మిషన్ ఎదురుగా ఉన్న అతని నివాసనికీ చేరి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట టీడీపీ నాయకులు కొండేపి శాసన సభ్యులు డా. డొల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, పాణ్యo నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి గారు, ఆకిపోగు ప్రభాకర్ గారు చనిపోయిన అచ్చెన్న కుమారుడు డాక్టర్ క్లింటన్ నీ పరామర్శించి,తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది

వైసీపీ ప్రభుత్వం లో దళితులకు రక్షణ లేదు అని,గతం లో కూడా దళిత కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ కూడా చనిపోవడం జరిగింది అని మండిపడ్డారు, ఈ అనుమస్పద మృతి లేదా హత్య? అనేది ఎలా జరిగిందో పోలీసు అధికారులు చర్యలు తీసుకొని, కారణం అయిన వారిని కటినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో కర్నూల్ టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,మాజీ మార్కెట్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, 19 వ వార్డుు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,కోడుమూరు టీడీపీ ఇంచార్జి లక్ష్మీపురం మరెన్న తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page