అడ్డగుట్టను అభివృద్ధి పధంలో నడిపిన ఘనత తమదేనని ఉప సభాపతి

Spread the love


The deputy chairman said that the credit of leading Addagutta in the development path is theirs

సాక్షిత : అడ్డగుట్టను అభివృద్ధి పధంలో నడిపిన ఘనత తమదేనని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రూ.కోటీ 20 లక్షల ఖర్చుతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజనల కు సంబంధించిన ప్రతి బస్తీ, ప్రతి కాలనీకి అన్నిఅభివృద్ధి ఫలాలు దక్కేలా జాగ్రత్తలు పాటిస్తున్నామని శ్రీ పద్మారావు గౌడ్ తెలిపారు. గడచిన ఐదేళ్ళ స్వల్ప వ్యవధిలోనే అడ్డగుట్ట డివిజన్ పరిధిలో వందల కోట్ల రూపాయల భారీ ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు.

కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, ఉప కమీషనర్ దశరద్, ఈ ఈ శ్రీమతి ఆశలత, డీ జీ ఎం శ్రీ కృష్ణ, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్,

లింగాని శ్రీనివాస్, అధికారులు, నేతలు పాల్గొన్నారు. తుకారం గేటురియో పాయింట్, బుద్దనగర్, లాలాగూడ కట్టెల మండీ ప్రాంతాల్లో రోడ్ల పునర్నిర్మాణం, వర్షపు నీటి కలువల నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page