శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం

Spread the love

శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం
విగ్రహ ప్రతిష్ట మరియు కుంభాబిషేక మహోత్సవ ఆహ్వానము మేరకు శుక్రవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళం రోడ్డులోని 11వ క్రాస్, శ్రీరాముల వారి వీధి, ఉపాధ్యాయ నగర్, తిరుపతి నందు గత మూడు రోజుల నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు
.
ఆలయ ధర్మకర్త మండలి పైడా శ్రీనివాసరెడ్డి, తోట నరసింహులు నాయుడు, ఆలయ కమిటీ మెంబర్లు మేయర్ డాక్టర్ శిరీష కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ధర్మకర్తలు, కమిటీ మెంబర్లు తదితరులతో అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ధర్మకర్తలు, కమిటీ మెంబర్లుకు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగరపాల సంస్థ ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ధర్మకర్త మండలి మరియు కమిటీ మెంబర్లకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వారితో పాటు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి , కార్పొరేటర్లు ఆదం రాధారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page