తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

Spread the love

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

  • ప్రజల కోసం చంద్రబాబు ఏ పని తలపెట్టినా విఘ్నాలు రాకుండా దీవించాలి
  • రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు
  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

గుడివాడ : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏ పని తలపెట్టినా విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు దీవించాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ కోరుకున్నారు. వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటనలో తన సందేశాన్ని పంపారు. భారతీయుల అతి ముఖ్య పండుగల్లో వినాయక చవితి ఒకటని అన్నారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయకచవితిగా జరుపుకుంటారన్నారు. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున దేవతలు, మహర్షులు, మనుషులు గణపతిని పూజించి తమ కోర్కెలను నెరవేర్చుకుంటూ ఉంటారన్నారు. వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతి, సామరస్యాలతో కూడిన జీవితాలను గడిపేందుకు విఘ్నేశ్వరుడు దీవించాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న చంద్రబాబుకు అవసరమైన శక్తియుక్తులను విఘ్నేశ్వరుడు ప్రసాదించాలని శిష్ట్లా లోహిత్ ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page