టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన తాటి

Spread the love

Tati gave a warm welcome to TPCC Chief Revanth Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన తాటి


సాక్షిత : ములుగు జిల్లా మేడారంలో హత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవంలో భాగంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కి స్థానిక ములుగు ఎమ్మెల్యే సీతక్క , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య తో కలిసి ఘన స్వాగతం పలికి, పూలమాలవేసి శాలువాతో సత్కరించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు . పూజా కార్యక్రమం అనంతరం రేవంతన్న నిలువెత్తు బంగారం సమర్పించారు

అక్కడే ఉన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ని ” తాటన్న బాగున్నావా అని పలకరించారు” అనంతరం తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హత్ సే హాత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం మొదలైంది అని అన్నారు,

రెండు దఫాలుగా ప్రజలు ఎన్నుకోబడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నిత్యవసర ధరలు మిన్నంటి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని హరితహారం పేరుతో పోడు భూములు లాక్కొని ఆదివాసీల ఉసురు పోసుకుంది అని అన్నారు, లక్షలాదిమంది విద్యార్థులు చదువులు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారు అన్నారు,

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందజేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి రానున్నది అన్నారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేం నరేందర్ రెడ్డి , మాజీ ఎంపీ రాజయ్య , సునీతా రావు , తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Compare