SAKSHITHA NEWS

స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫైనల్ అడ్మిషన్స్ గడువు జనవరి 29 వరకు పొడగింపు

పాల్వంచ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యం లో నిర్వహించే ఓపెన్ టెన్త్,ఇంటర్ 2024-25 ఫైనల్ అడ్మిషన్స్ గడువు జనవరి 29వ తేదీ వరకు పొడిగించబడినట్లు స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ ఏ. ఐ కోఆర్డినేటర్ జి.భాస్కరరావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేసినారు. అడ్మిషన్స్ పొందుటకు ఇదే చివరి అవకాశమని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. ఏప్రిల్ చివరి వారం నుండి నిర్వహించబడే వార్షిక పరీక్షలకు తమ సెంటర్ నందు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పి సి పి క్లాసులు నిర్వహించ బడుతున్నాయని అడ్మిషన్స్ పొందిన అభ్యర్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరినారు. మరిన్ని వివరాలకు 9866806532 నంబర్ ను సంప్రదించాలని తెలియజేసినారు .

            జి భాస్కరరావు 
           ఏ ఐ కోఆర్డినేటర్ 
     స్టార్ చిల్డ్రన్ హై స్కూల్,

పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app