జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సెమినార్

Spread the love

Seminar on Constitution of India under the auspices of District Congress

జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సెమినార్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని నేడు ఉదయం 10.00 గంటలకు శనివారం ఖమ్మం నగరం ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర గల టీటీడీసీ భవనంలో జిల్లా కాంగ్రెస్ కమిటి వారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దాని ప్రాముఖ్యతపై సెమినార్ కార్యక్రమము

నిర్వహించనున్నట్టు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా డాక్టర్ బి వెంకటేశ్వర్ రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎస్ఆర్అండ్ బీజి ఎన్ఆర్ కాలేజి ఖమ్మం, ఐవి రమణారావు గారు,

అకాడమీషియన్ న్యూ ఈర ఇన్స్టిట్యూషన్స్ ఖమ్మం, డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ , ప్రముఖ కార్డియాలజిస్ట్, సామాజిక కార్యకర్త, ఫౌండర్ ఆఫ్ పూలే అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ సోషల్ స్టడీస్, సీహెచ్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ జీడీసీ గర్ల్స్ కాలేజ్, ఖమ్మం వారు పాల్గొనున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బ్లాక్,మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అభిమానులు, యువత, మేధావులు,విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page